సిక్కోలును విభజించవద్దు: రామ్మోహన్నాయుడు
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 జిల్లాల ఏర్పాటు అసంబద్ధ ఆలోచనగా ఆయన అభిప్రాయపడ్డారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాలు మారితే ఏం చేస్తారని రామ్మోహన్నాయుడు ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాను విభజిస్తే తమ ప్రజల ఐక్యతను దెబ్బతీసినట్లేని.. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. జిల్లాను విభజించవద్దని.. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని రామ్మోహన్నాయుడు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?