ముందస్తు ఎన్నికలు ఇబ్బంది పెట్టాయ్: ఎల్ రమణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడం కొంత ఇబ్బందికి గురిచేసిందని తెదేపా తెలంగాణ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడం కొంత ఇబ్బందికి గురిచేసిందని తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా తెదేపా అధికారంలో లేకపోయినా పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు 106 మంది అభ్యర్థులు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన తెరాస ఇప్పుడు 55 స్థానాలకే పరిమితం కావటం, ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రెండు ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలను విస్మరించాయని మండిపడ్డారు. తొందర్లోనే పార్టీని బలోపేతం చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడతామని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!