తెరాస మాటలు పచ్చి అబద్ధం: రేవంత్రెడ్డి
గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. వివిధ పార్టీల తరఫున ఆయా పార్టీల సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బల్దియా ప్రజలపై వరాల జల్లులు...
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. వివిధ పార్టీల తరఫున ఆయా పార్టీల సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. బల్దియా ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. భారీ మెజార్టీతో తెరాసను గెలిపించాలని మంత్రి కేటీఆర్, హరీశ్రావు తదితర సీనియర్ నాయకులు తెరాస తరఫున ప్రచారం చేపడుతుండగా.. కాంగ్రెస్ తరఫున ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార తెరాసపై నిప్పులు చెరుగుతూ తనదైన శైలిలో ప్రసగిస్తున్నారు.
గత ఆరున్నరేళ్లలో చెయ్యలేనిది, గ్రేటర్లో ఈ సారి గెలిపిస్తే చేస్తామని తెరాస చెబుతుండటం పచ్చి అబద్ధమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. మన్సురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ. 67 వేల కోట్లతో హైదరాబాద్ను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ చెబుతున్నారని, అదే నిజమైతే మన్సురాబాద్లోని పెద్ద చెరువు నుంచి మూసీ నది నాళాను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కబ్జా కోరులకు తెరాస నాయకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వరదసాయం పేరిట ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తే అందులో సగం చోటా నాయకులే తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. మన్సురాబాద్లో కట్టిన రెండు పడక గదుల ఇళ్లను స్థానికులకే ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తానొక్కడినే పోరాడుతున్నానని.. కనీసం 25 నుంచి 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్కు ఇస్తే.. తెరాస మెడలు వంచైనా నగరాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ అన్నారు.
భాజపా, ఎంఐఎం ఇద్దర్నీ కలిపి కొడతాం: కేటీఆర్
మతంపేరిట రాజకీయాలు చేసే వాళ్ల మాయలో ప్రజలు పడొద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో కేంద్రానికి రూ.2.70లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే రూ.1.40లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారన్నారు. తమ డబ్బునే వారణాసి, పట్నాకు తరలిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్లోని గాంధీనగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపా, ఎంఐఎం ఇద్దర్నీ కలిపి కొడతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం 1920లో గండిపేట కట్టారని.. వందేళ్లలో మళ్లీ అలాంటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలు చేయలేదన్నారు. అందుకే కేశవాపూర్ రిజర్వాయర్ను నిర్మిస్తున్నామని.. ఏడాదిలో దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వరదలొస్తే కర్ణాటక, గుజరాత్కు నిధులిచ్చారని.. హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాస్తే ఉలుకూపలుకూ లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వరదసాయాన్నీ నిలిపేశారని ఆరోపించారు. రూ.10వేలు ఆపినోళ్లు.. రూ.25వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. వరద బాధితుల జాబితా ఇస్తానని.. మోదీని ఒప్పించి రూ.25వేలు ఇప్పించాలని భాజపా నేతలకు కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 4 తర్వాత మిగిలిన బాధితులందరికీ వరదసాయం అందిస్తామని స్పష్టం చేశారు. దిల్లీ నుంచి టూరిస్టులు వస్తారు పోతారని.. తెరాస మాత్రమే పక్కాలోకల్ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు