‘అపెక్స్ కమిటీ భేటీకి కేసీఆర్ సమయం ఇవ్వాలి’
నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరిస్తున్నారని...
డిమాండ్ చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నీటిని ఏపీకి తరలించే విషయంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారన్నారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు సీఎం వైఖరి వల్ల ఎడారిగా మారే అవకాశం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టదలుచుకున్న ప్రాజెక్టులకు తెలంగాణ సర్కారు సహకరిస్తోందని విమర్శించారు. నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి రాష్ట్ర భాజపా తరఫున లేఖలు రాశామని తెలిపారు. ఆగస్టు 12లోపు అపెక్స్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి సీఎం సమయం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి రాష్ట్ర భాజపా సిద్ధంగా ఉందని బండి సంజయ్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?