Prashant kishor: కాంగ్రెస్‌లోకి ప్రశాంత్‌ కిశోర్‌! 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా

Published : 02 Sep 2021 12:43 IST

త్వరలోనే సోనియా తుది నిర్ణయం

దిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై పార్టీలోని పలువురు సీనియర్‌ నేతలతో ఆమె చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిలో కొందరు ప్రశాంత్‌ చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. వీరిలో పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతేడాది సోనియాకు లేఖ రాసిన 23 మంది నేతలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే మరికొందరు నాయకులు మాత్రం కిశోర్‌ వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని