జీరోఅవర్లో హీరోగిరీ మంచిది కాదు: కేటీఆర్
శాసనసభ జీరో అవర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది.
శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో స్వల్ప సంవాదం
హైదరాబాద్: శాసనసభ జీరో అవర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది. మునుగోడు, చండూరు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దని.. ప్రభుత్వం చేయగలిగినవే చెప్పాలన్నారు. శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే కాదని రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు, నియోజకవర్గాలు ఉన్నాయని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా ఠంచనుగా రూ.148 కోట్ల నిధులు మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నామన్నారు. రాజగోపాల్రెడ్డి చెప్పినట్లుగా తామేమీ అభివృద్ధి చేయకుంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 130 మున్సిపాలిటీల్లో 122 స్థానాలను తెరాస గెలుస్తుందా? అని ప్రశ్నించారు. సత్యదూరమైన మాటలు మాని.. వాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని రాజగోపాల్రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. శాసనసభ జీరో అవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరీ చేస్తామంటే అది మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ