RJ పాలిటిక్స్‌‌: అంత్యాక్షరి, ఇటాలియన్‌ వంటలతో కాలక్షేపం!

కాంగ్రెస్‌ రెబల్‌ నేతలతో కలిసి రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నారని తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ ఖండించారు‌. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో జైపూర్‌లోని ఓ లగ్జరీ హోటల్‌ వేదికగా జరుగుతున్న కార్యకలాపాలపై విరుచుకుపడ్డారు.

Published : 21 Jul 2020 23:30 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ సెటైర్లు

జైపూర్‌: కాంగ్రెస్‌ రెబల్‌ నేతలతో కలిసి రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రపన్నారని తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ ఖండించారు‌. ఈ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో జైపూర్‌లోని ఓ లగ్జరీ హోటల్‌ వేదికగా జరుగుతున్న కార్యకలాపాలపై విరుచుకుపడ్డారు. ‘మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ.. దానిపై పోరాడాల్సిన సమయంలో మీరు అంత్యాక్షరి ఆడుతున్నారు. పేదలకు ఆహారం అందివ్వాల్సిన సమయంలో మీరు మాత్రం ఇటాలియన్‌ వంటకాలను తయారుచేయడం నేర్చుకుంటున్నారు. రాజస్థాన్‌ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అందరూ వీటిని గమనిస్తున్నారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, రాజస్థాన్‌లో గడిచిన వారంరోజులుగా క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. సచిన్ ‌పైలట్‌తోపాటు రెబల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టు బాటపట్టారు. ముఖ్యమంత్రి వర్గం మాత్రం జైపూర్‌లోని ఓ హోటల్‌లో మకాం వేసి వ్యూహాలు రచిస్తున్నారు. సీఎల్పీ సమావేశాలు కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్ర మంత్రిపై ఆరోపణలు రావడం, అనంతరం ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని