సిద్దిపేటకు కిషన్రెడ్డి, బండి సంజయ్
సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్ నుంచి బయల్దేరి అక్కడికి వెళ్లారు.
హైదరాబాద్: సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్ నుంచి బయల్దేరి అక్కడికి వెళ్లారు. దుబ్బాక ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి రఘునందన్రావు బంధువుల ఇంట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునందన్ సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిషన్రెడ్డి సిద్దిపేట బయల్దేరి వెళ్లారు.
మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన కరీంనగర్ నుంచి సిద్దిపేట చేరుకున్నారు. రఘునందన్ బంధువుల ఇళ్లపై దాడులు, సోదాలను ఖండిస్తు్న్నట్లు బండి సంజయ్ చెప్పారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. సిద్దిపేటలో దాడులు, సోదాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. భాజపా ముఖ్యనేతలు జితేందర్రెడ్డి, వివేక్ కూడా సిద్దిపేట చేరుకున్నారు.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?