టీపీసీసీకి ఉత్తమ్‌ రాజీనామా

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా

Updated : 24 Sep 2022 14:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పీసీసీకి కొత్త సారథిని ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది. ఉప్పల్‌, ఏఎస్‌రావు నగర్‌లో మాత్రమే గెలిచి హస్తం పార్టీ.. మిగతా చోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో ఎదురైన పరాభవంతో కొంత నైరాశ్యంలోకి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను గ్రేటర్ ఫలితాలు తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ‌‌ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని