‘కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని’
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్ గహ్లోత్ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని తమ పార్టీలో.........
రాజస్థాన్ సంక్షోభంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి
జైపుర్: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ప్రకటించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. కానీ, సీఎం అశోక్ గహ్లోత్ బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని వారి పార్టీలో విలీనం చేసుకొని మోసం చేశారని ఆరోపించారు. గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన ఈ విలీనంపై గతంలోనే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో వేచిచూశామన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేదని లేదని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తేల్చి చెప్పారు.
రాజస్థాన్లో బీఎస్పీ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్ని బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేశామని మాయావతి తెలిపారు. ఒకవేళ విప్ను ధిక్కరించినట్లైతే వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యే మదన్ దిల్వార్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నేడు మరోసారి ఇదే విషయంపై కొత్తగా పిటిషన్ వేశారు.
ప్రారంభమైన కేబినెట్ భేటీ..
మరోవైపు సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. గవర్నర్ కల్రాజ్ మిశ్రా రెండోసారి కూడా అసెంబ్లీ నిర్వహణ ప్రతిపాదనల్ని తిప్పి పంపడంతో తదుపరి అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చిస్తోంది. ఎలాగైనా శాసనసభను సమావేశపరిచి బలనిరూపణ చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. కానీ, ఇప్పటికీ రెండు సార్లు గవర్నర్ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. తొలుత ఆరు అంశాలపై వివరణ కోరిన గవర్నర్.. రెండోసారి అదనపు సమాచారం కావాలని కోరుతూ కేబినెట్ సిఫార్సులని వెనక్కి పంపారు. విశ్వాస పరీక్షకు వెళ్లాలనే ఉద్దేశముంటే దాన్ని ప్రస్తావిస్తూ తిరిగి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్లో గవర్నర్ పాత్రపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార భాజపా గవర్నర్ వ్యవస్థని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. భాజపా నియమించిన గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత