‘భాజపా, జేడీయూ పొత్తుకు ప్రమాదం లేదు’
బిహార్లో భాజపా, జేడీయూల పొత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ రాష్ట్ర భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. అరుణాచల్ప్రదేశ్లో భాజపా సంకీర్ణ ధర్మాలకు కట్టుబడి లేదని జేడీయూ ఆ పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పట్నా: బిహార్లో భాజపా, జేడీయూల పొత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ రాష్ట్ర భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. అరుణాచల్ప్రదేశ్లో భాజపా సంకీర్ణ ధర్మాలకు కట్టుబడి లేదని జేడీయూ ఆ పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఆయన సోమవారం ఓ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. ‘బిహార్లో భాజపా, జేడీయూల మధ్య మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విడదీయరానిది. అరుణాచల్ ప్రదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల ప్రభావం ఇక్కడ ఉండదు’ అని సుశీల్ మోదీ వెల్లడించారు.
బిహార్ ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాల గురించి సుశీల్ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నీతీశ్కుమార్ తాను సీఎం కావాలనుకోవడం లేదని చెప్పారు. భాజపాకు చెందిన వారే సీఎం కావాలని కోరారు. కానీ అప్పటికే ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా సీఎంగా ఆయన పేరునే ఖరారు చేసింది. కాబట్టి భాజపా, జేడీయూ, వీఐపీల విజ్ఞప్తి మేరకు ఆయన అంగీకరించారు’అని మోదీ తెలిపారు.
గత వారం అరుణాచల్లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో 60 సభ్యులు ఉన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో భాజపా బలం 48కి చేరగా.. జేడీయూకు ఒకే ఎమ్మెల్యే మిగిలారు. దీనిపై ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ‘ఇదే తరహా పరిణామాలు బిహార్లోనూ సంభవించవచ్చు. భాజపా కూటమి ధర్మాలను ఉల్లంఘిస్తోంది’ అని ఆరోపించారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM