ఫేస్బుక్, వాట్సాప్లను నియంత్రించేది వారే: రాహుల్
దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్, మెస్సేజింగ్ యాప్ వాట్సాప్లను భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లు నియంత్రిస్తాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు....
సామాజిక మాధ్యమాలపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు
దిల్లీ: దేశంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్, మెస్సేజింగ్ యాప్ వాట్సాప్లను భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లు నియంత్రిస్తాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా నాయకులు చేసే విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్బుక్ అంతగా పట్టించుకోదని అమెరికాకు చెందిన ఒక పత్రిక ప్రచురించిన కథనం ఇందుకు ఆధారం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘భారత్లో ఫేస్బుక్, వాట్సాప్లను భాజపా, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తాయి. వీటి ద్వారా వారు నకిలీ వార్తలు, విద్వేషాన్ని ప్రచారం చేస్తారు. అలానే వీటితో ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తారు. ఫేస్బుక్ గురించి అమెరికన్ వార్తా సంస్థ ఒక వాస్తవ కథనాన్ని ప్రచురించింది’’ అని ట్వీట్కు సదరు వార్తా కథనాన్ని జోడించారు.
‘భారత రాజకీయాలతో ఫేస్బుక్ విద్వేషపూరిత వ్యాఖ్యల నియమ నిబంధనలు తలపడ్డాయి’ (ఫేస్బుక్ హేట్-స్పీచ్ రూల్స్ కొల్లాయిడ్ విత్ ఇండియన్ పాలిటిక్స్) అనే పేరుతో ప్రముఖ వార్తా సంస్థ ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని ప్రచురించింది. అలానే భాజపా కార్యకర్తల పోస్టులపై చర్యలు తీసుకుంటే అవి భారత్లో సంస్థ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీస్తాయని ఫేస్బుక్ ఉన్నతస్థాయి ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించినట్లు అందులో పేర్కొన్నారు.
ఓడిన వ్యక్తులే అలా మాట్లాడతారు..
అయితే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ‘‘తమ పార్టీలోని వ్యక్తులను కూడా ప్రభావితం చేయలేని పరాజితులు ప్రపంచం మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయనే ఆరోపిస్తుంటారు. ఎన్నికలకు ముందు డేటాను ఆయుధంగా ఉపయోగించేందుకు కేంబ్రిడ్జ్ ఎనలిటికా, ఫేస్బుక్తో పొత్తుపెట్టుకున్న మీరు, ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారా’’ అని మంత్రి ట్వీట్ చేశారు. ‘‘సమాచారం, భావ ప్రకటనా స్వేచ్ఛ రెండు ప్రజాస్వామ్యం చేయబడ్డాయి. మీ కుటుంబానికి (కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి) సంబంధించిన వ్యక్తుల చేతుల్లో వాటి నియంత్రణ లేకపోవడం అనేది మీకు బాధ కలిగిస్తోంది. బెంగళూరు అల్లర్లను ఖండిస్తూ మీరు ఇంత వరకు ప్రకటన చేయలేదు. అప్పుడు మీ ధైర్యం ఎక్కడ ఉంది?’’ అని మరో ట్వీట్లో రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకోసం కొన్ని మిలియన్ యూజర్ల ఫేస్బుక్ సమాచారాన్ని లండన్ కేంద్రంగా పనిచేసే కేంబ్రిడ్జ్ ఎనలిటికా అనే సంస్థ దొంగిలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలానే ఈ సంస్థ 2010 బిహార్ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి సహాయం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై అప్పట్లో భాజపా, కాంగ్రెస్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్