AAP: వినూత్న ప్రయోగానికి విశేష ఆదరణ.. 24గంటల్లో 8లక్షల స్పందనలు
ఆమ్ ఆద్మీ పార్టీ తెరలేపిన వినూత్న ప్రయోగానికి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే 8లక్షల మంది స్పందించి సీఎంగా ఎవరు కావాలో తమ అభిప్రాయం తెలియజేశారు.......
దిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం కొత్త ఒరవడికి తెరతీసిన విషయం తెలిసిందే. 7074870748కి కాల్/మేసేజ్/వాట్సాప్ చేసి నచ్చిన అభ్యర్థిని ఎంచుకోమని తెలుపగా.. దీనికి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే 8లక్షల మంది స్పందించి సీఎంగా ఎవరు కావాలో తమ అభిప్రాయం తెలియజేశారు. ‘పంజాబ్లో తమ సీఎం అభ్యర్థిని సూచిస్తూ.. 24 గంటల్లోనే 8లక్షలకు పైగా ప్రజలు స్పందించారు. తమ విలువైన అభిప్రాయాన్ని తెలియజేశారు’ అని ఆప్ సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో 4లక్షలకు పైగా ఫోన్ కాల్స్, 3లక్షలకు పైగా వాట్సాప్ మెసేజ్లు, 50వేల టెక్ట్స్ మెసేజ్లతోపాటు లక్షలకు పైగా వాయిస్ మెసేజ్లు వచ్చినట్లు తెలిపారు. జనవరి 17 సాయంత్రం 5గంటల వరకు వచ్చే సందేశాలు, కాల్స్ తర్వాత అన్నింటిని విశ్లేషించి అత్యధిక ఓట్లు వచ్చిన వారిని తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం రాబోతోందని హర్పాల్సింగ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు మెచ్చిన వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని వెల్లడించిన పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఈ ప్రక్రియకు తెరలేపారు. ‘మూడు కోట్ల పంజాబ్ ప్రజలకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను వదిలేశాం. వారు జనవరి 17 సాయంత్రం ఐదు గంటలలోపు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని గుర్తించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించడం ఇదే మొదటిసారి’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా ఆప్ సీఎం అభ్యర్థులుగా భగవంత్ మన్, రైతు నేత నుంచి రాజకీయ నేతగా మారిన బల్బీర్ సింగ్ రాజేవాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార దాహం తీరకే శాపనార్థాలు
రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన భారాస నేతలు ఇంకా అధికార దాహం తీరక ఈ ప్రభుత్వం కొనసాగదు, కూలిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
22 నుంచి కేసీఆర్ బస్సుయాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే బస్సు యాత్రకు అనుమతి కోరుతూ భారాస అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్రాజ్కు వినతిపత్రం సమర్పించారు. -
రెండో రోజు 57 నామినేషన్లు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజైన శుక్రవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో కలిపి దాఖలైన నామినేషన్ల సంఖ్య 99కి చేరింది. -
దిల్లీ కాంగ్రెస్.. గల్లీ కాంగ్రెస్ వేర్వేరు
దిల్లీ కాంగ్రెస్, గల్లీ కాంగ్రెస్ వేరువేరని.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. -
ఎన్నికల తర్వాత రుణమాఫీ అంటే నమ్మేదెవరు?
ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల బోనస్ ఇవ్వాలని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
భాజపా, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు
త లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని భాజపా, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్లకు ఇప్పుడు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేలపై కేసుల నమోదు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు ఓ ఎంపీ అభ్యర్థిపై కేసులు నమోదయ్యాయి. -
కలిసి పనిచేయడానికి అంగీకారం
పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. -
భాజపా ఓటమే సీపీఎం లక్ష్యం: బీవీ రాఘవులు
మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. -
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్: కేటీఆర్
అన్నివర్గాల ప్రజలకు, యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కపటనీతికి మారు పేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. -
కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే!
మరో భారాస ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాదోపవాదాలు జరుగుతుండగా, మరోవైపు రాజేంద్రనగర్ భారాస ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం