AAP: ‘జాడూ’ ఊడ్చలేకపోయినా.. జాతీయపార్టీ హోదా దక్కింది..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఘోర పరాభవం ఎదురైంది. గుజరాత్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన ఆప్.. హిమాచల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత దేశంలో భాజపా(BJP) ప్రత్యామ్నాయం లేదా? అనే సందేహాలు పుట్టుకొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో తెరపైకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP). దశాబ్దం క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్లోక్పాల్ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్ ఆప్ను స్థాపించారు. దిల్లీ గల్లిలో పుట్టిన ఈ పార్టీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లోనూ సత్తా చాటి భాజపాకు ప్రత్యామ్నాయంగా అవతరించాలని కలలుకంది. కానీ ఆప్ ఆకాంక్షలకు బ్రేక్ పడింది. తాజా ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ ఆశలపై ఓటర్లు నీళ్లుచల్లారు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ఆప్.. గుజరాత్ (Gujarat)లో మూడో స్థానానికి పరిమితం కాగా.. హిమాచల్ (Himachal Pradesh)లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
పనిచేయని ‘పంజాబ్’ వ్యూహం..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన జోరుతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. తమ లక్ష్యం భాజపాను ఓడించడమే అని చెబుతూ ఏకంగా అన్ని స్థానాల్లో బరిలోకి దిగింది. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కానీ, ఆప్ దృష్టంతా గుజరాత్పైనే. అందుకే.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సహా పార్టీ కీలక నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. పంజాబ్ మాదిరిగానే గుజరాత్లోనూ ఉచిత విద్య, ఉచిత విద్యుత్ అంటూ వరాలు గుప్పించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా తరచూగా గుజరాత్లో పర్యటించడమే గాక.. పంజాబ్లో ఉచిత విద్యుత్కు సంబంధించిన ప్రజల కరెంటు బిల్లులును తీసుకొచ్చి మరీ ప్రచారం చేశారు. కానీ ఈ వ్యూహాలేవీ ఆమ్ ఆద్మీకి ఫలితాన్నివ్వలేదు. కేవలం ఓట్లను చీల్చడంలో తప్ప ఈ పార్టీ గుజరాత్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాజా ఎన్నికల్లో కనీసం రెండంకెల స్థానాలను కూడా దక్కించుకోలేకపోయిందంటే.. రాష్ట్రంలో ఈ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక, హిమాచల్ప్రదేశ్లోనూ ఆమ్ ఆద్మీకి భంగపాటు తప్పలేదు. ఈ ఎన్నికల సమయంలో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్పై ఆమ్ ఆద్మీ దృష్టిసారించలేకపోయింది. ప్రచారం చేసింది కూడా అంతంతమాత్రమే. ఫలితంగా ఈ రాష్ట్రంలో ఆప్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.
ఇబ్బందిపెట్టిన అవినీతి మరకలు..
అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ తర్వాత సాధారణ రాజకీయ పార్టీగా అవతరించిందనడంలో సందేహం లేదు. ఆ పార్టీలోనూ వ్యక్తి పూజ ప్రారంభమైంది. ప్రకటనల్లోనూ కేజ్రీవాలే ప్రధానంగా కనిపించేవారు. ప్రచారం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. లోక్పాల్ బిల్లుపై పుట్టుకొచ్చిన ఆ పార్టీ.. దిల్లీలో ఇంతవరకు దాన్ని తీసుకురాలేదు. ఇక అవినీతి మరకలు కూడా పార్టీని వేధించాయి. గుజరాత్ ఎన్నికల సమయంలో దిల్లీలో బయటపడిన మద్యం కుంభకోణం.. పార్టీపై తీవ్ర ప్రభావమే చూపించింది. కీలక మంత్రులు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోదియా వంటివారిపై కేసులు నమోదవ్వడం.. ఆమ్ ఆద్మీ ప్రాభవాన్ని దెబ్బకొట్టింది. ప్రతిపక్షాలపై జాతీయ సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ భాజపాపై వచ్చిన విమర్శలను ఆప్ బలమైన అస్త్రాలుగా మార్చుకోలేకపోయింది.
‘జాతీయ’ ఊరట..
అయితే, ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొద్దిలో కొంత దక్కిన సంతోషం ఏంటంటే.. ‘జాతీయ’ హోదా దక్కేందుకు మార్గం లభించడం. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున పొందిన ఓట్లు లేదా ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్.. దిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండగా.. ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12 శాతం ఓటు షేరు సాధించింది. దీంతో జాతీయ పార్టీగా అవతరించేందుకు అర్హత సాధించినట్లైంది.
మొత్తానికి 2024 ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనేందుకు అవసరమైన బూస్ట్ను మాత్రం ఈ ఫలితాలు అందించలేకపోయాయనే చెప్పాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.