ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్లు జైలు శిక్ష
ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి దిల్లీ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2016లో ఎయిమ్స్ భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్.......
దిల్లీ: ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి దిల్లీ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2016లో ఎయిమ్స్ భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా కూడా విధించారు. అయితే, ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకొనేందుకు వీలుగా ఆయనకు బెయిల్ మంజూరైంది.
2016 సెప్టెంబర్ 9న సోమనాథ్ భారతితో పాటు దాదాపు 300 మంది ఎయిమ్స్ వద్ద సరిహద్దు గోడను జేసీబీతో పడగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ అధికారి ఆర్ఎస్ రావత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్టు న్యాయస్థానం పేర్కొంది. సోమ్నాథ్ భారతితో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఆయన సన్నిహితులు జగత్ సైనీ, దిలీప్ ఝా, సందీప్ సోనూ, రాకేశ్ పాండేకు వ్యతిరేకంగా ఆధారాలు లభ్యంకాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ