Shiv sena: బాంబే హైకోర్టులో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఊరట!
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట కలిగింది. తూర్పు అంధేరి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లాఠ్కే భార్య రుతుజ లాఠ్కే రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముంబయి: శివసేన పార్టీ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల మృతి చెందిన తూర్పు అంధేరి నియోజవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ లాఠ్కే భార్య రుతుజ లాఠ్కే తన ఉద్యోగానికి చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. శివసేన రెండు వర్గాలుగా చీలిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. రమేశ్ లాఠ్కే మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉద్ధవ్ వర్గం నుంచి రుతుజ లాఠ్కేను బరిలోకి దించుతున్నారు. ఆమె బృహాన్ ముంబయి మున్సిపాలిటీలో క్లర్క్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని కారణంగా.. సెప్టెంబరు 2వ తేదీనే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, పైఅధికారులు దాన్ని ఆమోదించలేదు. నామినేషన్ దాఖలు చేయడానికి శుక్రవారమే చివరి రోజు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగి రాజీనామా చేసిన నెలలోపు నిర్ణయం తీసుకోవచ్చని బీఎంసీ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ ఒక ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలో తప్పేముంది? ఆమె ఓ క్లర్కు. ఇది సంస్థకు, ఉద్యోగికి మధ్య ఉన్న చిన్న అంశం మాత్రమే. దీన్ని ఎక్కువ రోజులు వాయిదా వేయొద్దు. శుక్రవారం ఉదయం 11గంటల లోగా ఆమె రాజీనామాను ఆమోదించండి’’ అని కోర్టు ఆదేశించింది.
మరోవైపు, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంగానీ, భాజపా గానీ పోటీ చేయడం లేదు. కానీ, ఇటీవల పార్టీ పేరు, గుర్తు కేటాయింపులపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని ఠాక్రే వర్గం కోరింది. శిందే వర్గం కూడా త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడుతోపాటు గద గుర్తులను సమర్పించింది. శిందే వర్గం ప్రతిపాదించిన త్రిశూలం, గద మతపరమైన చిహ్నాలను ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో వాటిని కేటాయించడానికి నిరాకరించింది. ఉదయిస్తున్న సూర్యుడు గుర్తు ఇప్పటికే డీఎంకేకు ఉన్నందున దాన్ని కూడా తిరస్కరించింది. చివరికి ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పార్టీతో పాటు ‘కాగడా’ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం..శిందే వర్గానికి ‘బాలాసాహెబంచి శివసేన’ పేరు, రెండు కత్తులు, డాలు ఉన్న గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్