Telangana News: శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు

Updated : 03 Jul 2022 20:28 IST


హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్‌ వద్ద గేదెలు అడ్డురావడంతో సుఖేందర్ రెడ్డి కాన్వాయ్ ముందు వెళ్తున్న ఓ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో తనకు, సిబ్బందికి ఎలాంటి అపాయం జరగలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. అందరం క్షేమంగా ఉన్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని