MLA Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి అదనపు భద్రత

తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత పెంచింది. సంచలనం సృష్టించిన  ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో  పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో ఆయన కీలకంగా ఉన్నారు.

Updated : 29 Oct 2022 11:18 IST

హైదరాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రత మరింత పెంచింది. సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో ఆయన కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అదనపు భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్కార్ట్‌ వాహనాన్ని సమకూర్చింది. ఆయన ఇంటి వద్ద పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని పోలీసులు సమకూర్చారు. ఇప్పటికే రోహిత్‌రెడ్డికి 4+4 భద్రతను ప్రభుత్వం కల్పించింది.

ఈ కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ కీలక ఆధారాల్ని సేకరించి పెట్టింది. తనను ప్రలోభపెట్టేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందస్తుగానే రంగంలోకి దిగిన పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చి సంభాషణల్ని రికార్డు చేశారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సమావేశాన్ని చిత్రీకరించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ ఆపరేషన్‌ సాగిన తీరును సవివరంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని