పచ్చని పల్లెలో ‘రాజకీయ చిచ్చు’!
పచ్చని పల్లెలో రాజకీయం చిచ్చు రాజేసింది. ఆ ఊరి ఆనవాయితీకి గండి కొట్టింది. ఏకతాటిపై నిలిచి అభివృద్ధిలో ఆదర్శప్రాయంగా ఉన్న పల్లె పెద్దల్లో పంతాలొచ్చాయి.......
30 ఏళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికలు
ఇంటర్నెట్ డెస్క్: పచ్చని పల్లెలో రాజకీయం చిచ్చు రాజేసింది. ఆ ఊరి ఆనవాయితీకి గండి కొట్టింది. ఏకతాటిపై నిలిచి అభివృద్ధిలో ఆదర్శప్రాయంగా ఉన్న పల్లె పెద్దల్లో పంతాలొచ్చాయి. 30 ఏళ్లుగా ఏకగ్రీవమవుతున్న ఆ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ మొదలైంది. ఆనవాయితీ కొనసాగించాలని గ్రామ పెద్దలు.. బరిలో నిలవాల్సిందేనని కొందరు వ్యక్తులు పంతం పట్టారు. ఇంతకీ ఈ పంచాయతీలో నెగ్గేదెవరు?
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామ పంచాయతీ జనాభా 1404 మంది. మొత్తం 997 ఓట్లు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామాభివృద్ధి కోసం అంతా ఏకతాటిపైనే ఉన్నారు. గ్రామ పెద్దలంతా కలిసి ఎవరిని సర్పంచ్గా నిర్ణయిస్తే వారికే అంతా మద్దతు తెలిపేవారు. అలా బడి, గుడి, రోడ్డు వంటి సౌకర్యాలతో గ్రామాన్ని అభివృద్ధిచేసుకున్నారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబు సీఎం హోదాలో ఈ గ్రామానికి వచ్చి అభివృద్ధిని ప్రశంసించారు. అయితే, పంచాయతీ ఎన్నికల విషయంలో సామరస్యంగా ఉండే గ్రామస్థుల మధ్య రాజకీయ పంచాయతీ మొదలైంది. ఏకగ్రీవానికి ప్రయత్నాలు సాగుతున్న సమయంలో అనూహ్యంగా రేషన్ డీలర్ బంధువు నామినేషన్ వేశారు. పోటీకి అభ్యర్థిని పెట్టకపోతే రేషన్ దుకాణం తొలగిస్తామని ఒత్తిడి తెచ్చారని గ్రామపెద్దల ఆరోపణ. నామినేషన్ వేసిన అభ్యర్థిని కనిపించకుండా దాచేశారని చెబుతున్నారు. కొన్ని రాజకీయ శక్తుల వల్ల పల్లెలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుందని మాజీ సర్పంచులు విచారం వ్యక్తంచేస్తున్నారు.
‘సుమారు 1981 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవ పంచాయతీలే జరిగాయి. పెద్దల మాటే వినేవారు. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. చెబితే వినడంలేదు. అరాచకశక్తులు కొన్ని చేరాయి. వాళ్లతో చేతులుకలిపి చేస్తున్నారు’ అని గ్రామ పెద్ద ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు.
నేను 2013లో సర్పంచ్గా ఎన్నికయ్యా. చంద్రబాబు రచ్చబండలో పాల్గొని మంచి పనులు చేసినందుకు అభినందించారు. మాకు సహకరించారు. బాగా పనిచేశాం. ఇప్పుడు రాజకీయ లబ్ధికోసం రెండు మూడు కుటుంబాలు అడ్డుపడుతున్నాయి - తాజా మాజీ సర్పంచ్, సుందరమ్మ
కప్పలబండలో ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాటను గ్రామస్తులు గౌరవిస్తారు. కానీ ఈసారి ఎవరు ఎంతగా చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామ పెద్దలు నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు.
అప్పుడు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు కొన్ని రాజకీయ శక్తుల వల్ల చాలా ఇబ్బందులపాలవుతున్నాం. కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నాం అని ఆ గ్రామస్థుడు ఒకరు తెలిపారు.
ఏకగ్రీవంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పల్లెలో ఎన్నికలు జరిగితే భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి..
జమ్మలమడుగులో పంచాయితీల్లేని ‘పంచాయతీ’!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!