AAP: దిల్లీలో విక్టరీ.. ఆప్ చూపు ఇప్పుడు బెంగళూరు వైపు!
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసిన ఉత్సాహంలో ఉన్న ఆప్ ఇప్పుడు బెంగళూరు వైపు చూస్తోంది.
బెంగళూరు: దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసిన ఉత్సాహంలో ఉన్న ఆప్ ఇప్పుడు బెంగళూరు వైపు చూస్తోంది. భాజపాను ఓడించే సత్తా తమకే ఉందని, బెంగళూరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇలాంటి ప్రభావమే చూపించాలని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. దిల్లీలో మొత్తం 250 సీట్లకు జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆప్ 134 సీట్లు సాధించి భాజపాకు గట్టిషాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆప్ బెంగళూరు అధ్యక్షుడు మోహన్ దాసరి స్పందించారు. ‘‘భాజపాను ఆప్ తప్ప ఏ రాజకీయ పార్టీ ఓడించలేదు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు యావత్ దేశానికి ఓ సందేశం ఇచ్చింది.. భాజపాను ఓడించేందుకు ఆప్ బలపడాలి. మా పార్టీ బలోపేతం కావడం వల్ల భాజపాను అధికారం నుంచి గద్దె దించి ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలవుతుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఎన్నికలు ఎప్పుడు జరిగినా బెంగళూరు ఓటర్ల నుంచి ఇదేరకమైన స్పందన పొందేందుకు ఆప్ సిద్ధంగా ఉంది. సీఎం కేజ్రీవాల్ సారథ్యంలోని ప్రభుత్వ పనితీరు చూసి అక్కడి ప్రజలు ఆప్కు ఓటువేశారు.. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆప్ వైపు ఆకర్షితులవుతున్నారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.