ఆ పార్టీ భాజపాకు B టీమ్.. మా టీమ్లో చోటులేదు: సంజయ్ రౌత్
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ఆ పార్టీకి తమ కూటమిలో చోటు లేదన్నారు.
ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. ఆ పార్టీకి తమ కూటమిలో చోటు లేదన్నారు. ఆ పార్టీ భాజపాకు ‘బి’ టీమ్ అని ఆరోపించారు. తమను కూటమిలో చేర్చుకుంటే భాజపాను అధికారంలోకి రాకుండా నిలువరించొచ్చంటూ ఎంఐఎం ఎంపీ, ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖలు చేశారు.
‘‘ఏఐఎంఐఎంకు భాజపాతో చీకటి ఒప్పందం ఉంది. ఈ విషయం ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నిరూపితమైంది. ఇప్పటికీ ఆ పార్టీ భాజపాకు ‘బి’ టీమ్గానే కొనసాగుతోంది. మూడు పార్టీలతో కూడుకున్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో నాలుగో పార్టీకి చోటు లేదు’’ అని రౌత్ అన్నారు. కూటమిలోని పార్టీలన్నీ ఛత్రపతి శివాజీ మహరాజ్, ఛత్రపతి శంభాజీ మహరాజ్లను గౌరవిస్తాయన్నారు. ఎంఐఎం పార్టీ ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లుతుందని విమర్శించారు. హిందుత్వ కోణంలో చూసినప్పుడు శివాజీని అంతమొందించేందుకు ఔరంగజేబు విఫలయత్నం చేశారని గుర్తుచేశారు. అలాంటి పార్టీకి కూటమిలో చోటు లేదని పేర్కొన్నారు. అలాగే, కూటమికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ భాజపా ఎంపీ రావు సాహెబ్ ధన్వే చేసిన వ్యాఖ్యలనూ రౌత్ కొట్టి పారేశారు. ఆయనకు ఇంకా హోలీ మత్తు దిగినట్లు లేదని, ఆయన ఏం మాట్లాడారో ఆయనకే గుర్తుండదని వ్యాఖ్యానించారు.
ఇంతకీ జలీల్ ఏమన్నారు..?
భాజపాను ఓడించేందుకు శివసేనకు శక్తి సరిపోవడం లేదని, అందుకే కాంగ్రెస్, ఎన్సీపీని కలుపుకొని వెళుతోందని ఇంతియాజ్ జలీల్ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మూడు చక్రాల బండికి (ఆటో).. ఎంఐఎం అనే నాలుగో చక్రం తగిలిస్తే ఒక పూర్తిస్థాయిగా కారుగా మారుతుందన్నారు. తద్వారా భాజపాను ఓడించడం సులువు అవుతుందని చెప్పారు. భాజపాకు ఎంఐఎం ‘బి’ టీమ్గా వ్యవహరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూ భాజపా విజయానికి సహకరిస్తున్నామని అంటున్నారని, దాని బదులు భాజపాను ఓడించేందుకు కలిసి పనిచేద్దామని చెబుతున్నామని జలీల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!