UP Polls: ఐటీ రంగంలో యువతకు22లక్షల ఉద్యోగాలు: అఖిలేశ్ హామీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని ఓటేసి గెలిపిస్తే 22లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు.......
లఖ్నవూ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే 22లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం లఖ్నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఐటీ రంగంలో యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగంలో చేసిన కృషిని ఈ సందర్భంగా అఖిలేశ్ ప్రస్తావించారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిందన్నారు. రాష్ట్రంలోని చక్ గజారియా ఫామ్లో హెచ్సీఎల్ తొలిసారి పెట్టుబడులు పెట్టిందనీ.. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ముందుకు తీసుకెళ్లి ఉంటే లఖ్నవూ ఐటీ హబ్గా గుర్తింపు పొంది ఉండేదన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని ఆరోపించారు. హెచ్సీఎల్ క్యాంపస్లో 5వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారనీ.. మరికొంత మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్టు చెప్పారు.
కర్హాల్ నుంచే అఖిలేశ్ పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ తొలిసారి రంగంలోకి దిగుతున్నారు. మెయిన్పురి జిల్లాలోని కర్హాల్ సీటు నుంచి పోటీ చేస్తారంటూ సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, కాంగ్రెస్ మాజీ ఎంపీ పర్విన్ సింగ్ అరోన్, ఆయన సతీమణి సుప్రియా సమాజ్వాదీ పార్టీలో చేరారు. అఖిలేశ్ యాదవ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సుప్రియాకు కాంగ్రెస్ బరేలీ కంటోన్మెంట్ సీటు ఖరారు చేయగా.. ఇప్పుడు ఆమె అదే సీటు నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనుండటం గమనార్హం. అయితే, ఇప్పటికే ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ రాజేశ్ అగర్వాల్ పేరును ప్రకటించినప్పటికీ ఆ సీటును సుప్రియకు కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ