Akhilesh Yadav: ఆ లెక్కన చూస్తే మేం 304 సీట్లు గెలిచాం: అఖిలేశ్
యూపీ ఎన్నికల ఫలితాలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ సారథ్యంలోని....
లఖ్నవూ: యూపీ ఎన్నికల ఫలితాలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ సారథ్యంలోని తమ కూటమి పోస్టల్ బ్యాలెట్లో 51.5శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే తాము 304 సీట్లు గెలుచుకున్నట్టు లెక్క అని తెలిపారు. ‘‘ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కూటమికి 51.5శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం తమ కూటమి 304 సీట్లలో విజయం నమోదు చేసిందన్న వాస్తవాన్ని తెలియచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మోసం బలం కాదనే విషయాన్ని అధికార పార్టీ తెలుసుకోవాలి’’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఇటీవల ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో సమాజ్వాదీ పార్టీ గట్టి పోటీ మోదీ-యోగి వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. ఈ ఎన్నికల్లో భాజపా 255 సీట్లతో భారీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికార పీఠం నిలుపుకోగా.. సమాజ్వాదీ పార్టీ 111 స్థానాలతో బలం పుంజుకొంది. సమాజ్వాదీ పార్టీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి ఎనిమిది సీట్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్