పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’: ద్వివేది
రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పోలింగ్ కేంద్రాల
అమరావతి: రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కొవిడ్ రోగులు పోలింగ్ చివరి గంటలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్శాఖ కమిషనర్ గిరిజాశంకర్తో కలిసి ద్వివేది మీడియాతో మాట్లాడారు.
పోలింగ్ జరిగే తీరును వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని ద్వివేది చెప్పారు. ఎన్నికల్లో తొలిసారిగా నోటా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నోటాకు వచ్చే ఓట్లు లెక్కించబోమని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతలో 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీలగాను 525 చోట్ల.. 32,502 వార్డు మెంబర్లకి 12,185 చోట్ల ఏకగ్రీవమైనట్లు తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 2,724 సర్పంచ్ స్థానాలు, 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏకగ్రీవాలపై చిత్తూరు కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిందని.. గుంటూరు కలెక్టర్ నుంచి ఇంకా రావాల్సి ఉందని వివరించారు. ఆ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ద్వివేది చెప్పారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ