Punjab: పార్టీని భాజపాలో విలీనం చేయనున్న అమరీందర్ సింగ్!
గతేడాది పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్(80) తన పార్టీని భాజపాలో కలపనున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి.......
చండీగఢ్: గతేడాది పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్(80) (Amarinder Singh) తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమరీందర్ తిరిగివచ్చిన వెంటనే తన పార్టీ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ (పీఎల్సీ)ని (Punjab Lok Congress) కాషాయ పార్టీలో విలీనం చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లండన్లో శస్త్రచికిత్స పూర్తిచేసుకున్న అమరీందర్.. వచ్చే వారం స్వదేశానికి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ విలీనంపై ప్రధాని మోదీతో కెప్టెన్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన అమరీందర్ను.. గతేడాది సీఎం పదవి నుంచి అధిష్ఠానం తొలగించింది. భాజపా కనుసన్నల్లో అమరీందర్ పనిచేయడం కారణంగానే పదవి నుంచి తొలగించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెప్టెన్ కాంగ్రెస్ను వీడారు. ఆపై పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి ముందుకు సాగారు. భాజపా మొత్తం 65 సీట్లలో పోటీ చేయగా.. అమరీందర్ పార్టీ 37 సీట్లలో పోటీకి దిగింది. అయితే కెప్టెన్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. కెప్టెన్ పటియాలా నుంచి పోటీ చేసిన కెప్టెన్కు డిపాజిట్ కూడా దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM