Amit Shah: కేసీఆర్ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు: అమిత్షా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణ నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర పదవుల కోసం కాదని.. తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. కేసీఆర్ను సీఎం పీఠం నుంచి దించేందుకు తాను అవసరం లేదని.. సంజయ్ ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. రజాకార్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు, తెరాసను కూకటివేళ్లతో పెకలించివేసేందుకే ప్రజాసంగ్రామ యాత్ర అని చెప్పారు. 45 డిగ్రీల ఎండలో బండి సంజయ్ 660 కి.మీ. నడిచారన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రంలో జరిగాయా? అని అమిత్షా ప్రశ్నించారు. యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలోని అవినీతి సర్కార్ను గద్దె దించేందుకు యువత కదిలి రావాలని అమిత్షా పిలుపునిచ్చారు.
ధాన్యం సేకరణ మీ బాధ్యత.. చేతకాకపోతే రాజీనామా చెయ్..
‘‘ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. రెండు పడక గదుల ఇళ్లను కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారు? ప్రధాని ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదు. హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ధాన్యం సేకరణ మీ బాధ్యత. చేతకాకపోతే రాజీనామా చెయ్. మేం అధికారంలోకి వచ్చి కొంటాం. గాంధీ, ఉస్మానియాను పట్టించుకోని సీఎం.. కొత్తగా నిర్మిస్తారా?
కేంద్ర పథకాలకే పేర్లు, ఫొటోలు మార్చేస్తున్నారు
కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులిస్తే.. దానికే మన ఊరు-మనబడి అంటున్నారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తిచేయట్లేదు? రాష్ట్రంలో కమీషన్లు వచ్చే ప్రాజెక్టులనే ఆయన పూర్తిచేస్తారు. వరంగల్కు సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే పట్టించుకోవట్లేదు. ప్రధాని గ్రామీణ సడక్ యోజన కింద రూ.వేలకోట్లు నిధులిచ్చాం. కేంద్రం నిధులతోనే గ్రామాలకు రోడ్లు వేశారు. రామగుండం ఫర్టిలైజర్కు కేంద్రమే నిధులిచ్చింది. పేదలకు రూ.5లక్షల వైద్యసాయం అందే పథకాన్ని నిలిపేశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు కావట్లేదు?
తెరాస కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో..
రాష్ట్రంలో కేసీఆర్ హత్యారాజకీయాలు మొదలుపెట్టారు. భాజపా కార్యకర్త సాయిగణేశ్ను పొట్టనపెట్టుకున్నారు. తెలంగాణలో అధికార మార్పునకు సమయం వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా సిద్ధంగా ఉంది. తెరాస, మజ్లిస్ను తీసిపడేయండి.. అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేం నిర్వహిస్తాం. మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతాం. ఎంఐఎం, తెరాస పార్టీలు అవిభక్త కవలలు. తెరాస కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి మళ్లీ అప్పులు కావాలంటున్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని అమిత్షా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు.