Amit shah: హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అమిత్ షా ట్వీట్
హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం.. అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనడానికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దిల్లీ: ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక (MLC elections)లో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, ఆయన గెలుపు కోసం పనిచేసిన భాజపా శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయమే తెలియజేస్తోందని పేర్కొన్నారు. మార్చి 13న ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో భాజపా బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.
బీఆర్ఎస్ సర్కార్కు గుణపాఠం తప్పదు: బండి
భాజపా అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ధర్మం వైపు నిలబడిన ఉపాధ్యాయులు, అధ్యాపకులదిగా పేర్కొన్నారు. టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి ఉపాధ్యాయుల సమస్యలకు చొరవచూపాలని కోరారు. నియంతృత్వ పోకడలకు పోతున్న భారాస సర్కార్కు తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్