Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ
మునుగోడు ఉప ఎన్నిక ఇన్ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ నెలకొంది. ఈటల రాజేందర్
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఇన్ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ నెలకొంది. ఈటల రాజేందర్, జితేందర్రెడ్డి, వివేక్, మనోహర్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమిత్ షా పర్యటన తర్వాత ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్లను ఈటల రాజేందర్ భాజపాలోకి తీసుకొచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్ సెంటిమెంట్తో జితేందర్రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్రెడ్డిని ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది. రాజగోపాల్రెడ్డికి సన్నిహితుడిగా, పార్టీకి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరూ పరిశీలనలో ఉంది.
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు
నల్గొండ జిల్లా మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న మధ్యాహ్నం 3.30గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు రానున్న అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్లో 4.30గంటలకు మునుగోడు చేరుకుంటారు. సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష అనంతరం సాయంత్రం 5గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు. 6గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు