మోదీ ర్యాలీలు..ఎన్డీయే అభ్యర్థుల జోరు..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ అభ్యర్థులు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. అయితే, మరో ఆసక్తికర విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న చాలా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ససారాం, గయ, పట్నా, చాప్రా, దర్భంగా, ముజఫర్పూర్, భాగల్పూర్, ఈస్ట్ చంపారన్, సమస్తిపూర్, వెస్ట్ చంపారన్, సహర్సా, ఫోర్బెస్గంజ్లో ఆయన పర్యటించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం..ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులు లెక్కింపులో ప్రత్యర్థులను నెట్టేసి దూసుకెళ్తున్నారు. భాగల్పూర్ భాజపా అభ్యర్థి రోహిత్ పాండే..కాంగ్రెస్ అభ్యర్థిని దాటేసి ఆధిక్యంలో ఉన్నారు. దర్భంగాలో 10 స్థానాలకు గాను 9 స్థానాల్లో భాజపా దూసుకెళ్తోంది. పట్నాలోనూ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. సహర్సాలో పోటీ పడిన అలోక్ రంజన్(భాజపా) ఆధిక్యంలో ఉండగా, ఆర్జేడీ అభ్యర్థి లవ్లీ ఆనంద్ వెనకంజలో ఉన్నారు.
కాగా, 243 అసెంబ్లీ స్థానాలు గానూ..దాదాపు సగం సీట్లలో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపులో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను దాటి భాజపా దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. శనివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం మహాగట్ బంధన్వైపే మొగ్గు చూపాయి. కానీ, మంగళవారం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 144 నియోజకవర్గాల్లో ఆర్జేడీ అభ్యర్థులను నిల్చోబెట్టగా..65 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. 70 స్థానాలకు గానూ 21 స్థానల్లోనే ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నామినేషన్లకు ముఖ్యులు
భాజపా లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
డీకే అరుణకు రూ.66.75 కోట్ల ఆస్తులు
మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ (అరుంధతి) తన కుటుంబానికి రూ.66.75 కోట్ల విలువైన ఆస్తులు (రూ.26.47 కోట్ల చరాస్తులు, రూ.40.27 కోట్ల స్థిరాస్తులు) ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. -
ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు: నిరంజన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
పీసీసీ అధికార ప్రతినిధులకు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు 28 మందిని కేటాయించింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్