Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్పై అనిరుధ్రెడ్డి తీవ్ర ఆరోపణలు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఇటీవల జరుగుతున్న
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణమాలపై ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటున్న తనను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్కు అనిరుధ్రెడ్డి వాట్సాప్ ద్వారా లేఖ పంపారు.
9 హత్య కేసుల్లో నిందితుగా ఉన్న ఎర్ర శేఖర్తో వేదిక పంచుకోలేనని మాణికం ఠాగూర్కు అనిరుధ్ స్పష్టం చేశారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే శేఖర్ హత్య చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పార్టీలో చేరిన సందర్భంలో ఒకలా.. ఇప్పుడు మరోలా శేఖర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
‘‘ఎర్ర శేఖర్పై 9 హత్య కేసులు ఉన్నాయి. అలాంటి వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని చెప్పాం. అయినా పార్టీలోకి తీసుకున్నారు. సరే పార్టీ నిర్ణయం కదా అని ఊరుకున్నాం. హంతకుడి పక్కన నిలుచుంటే ప్రజలు ఏం చూసి మాకు ఓటేస్తారనే ఆలోచనలో పడ్డాం. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన వ్యక్తి.. ఎమ్మెల్యే టికెట్ కోసం చంపడని గ్యారెంటీ ఏంటని నా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మక్తల్, దేవరకద్రలోనూ ఇతర పార్టీల నేతలను తీసుకుంటున్నారు. దీంతో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు’’ అని అనిరుధ్రెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం