Pawan Kalyan: జనసేన కౌలురైతు భరోసా నిధికి అంజనాదేవి సాయం.. పవన్‌కు చెక్కు అందజేత

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతుల భరోసాయాత్ర  ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో

Updated : 26 Jun 2022 06:27 IST

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కౌలు రైతుల భరోసాయాత్ర  ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. పవన్‌ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో పవన్‌కు అందజేశారు. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... కౌలు రైతుల భరోసాయాత్ర నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నిస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం’’ అని పవన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని