నాని భేషరతుగా క్షమాపణలు చెప్పాలి: భాజపా
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఖండించింది. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే కొడాలి...
అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఖండించింది. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే కొడాలి నానిని తన మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలంటూ రేపు అన్ని జిల్లాల కలెక్టరు కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. భాజపాపై మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోన్న మంత్రి నానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై సైతం నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తమ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకునే మంత్రి నాని తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. అధికార పార్టీలో పిచ్చోళ్లు ఎక్కవయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో ఇలాంటి వాళ్లను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని కోరతామని వారు ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం