Andhra News: మా వ్యవస్థను ప్రశాంత్ కిషోర్ కాపీ కొట్టారు: సోము వీర్రాజు
ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే భాజపాతోనే సాధ్యమని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
విశాఖ: ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే భాజపాతోనే సాధ్యమని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాకే దశాదిశ ఉన్న ప్రభుత్వం వస్తుందని చెప్పారు. విశాఖలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
‘‘భాజపా గెలుపునకు పేజ్ ప్రముఖ్ వ్యవస్థ కీలకమైంది. కోడికత్తి పీకే(ప్రశాంత్ కిషోర్) మా పేజ్ ప్రముఖ్ వ్యవస్థను కాపీ కొట్టారు. బియ్యం, ఉపాధి హామీ అన్నీ కేంద్రమే ఇస్తోంది. జగన్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఫలితం లేకుండా పోయింది. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ నెల 19న ‘చలో కడప’ చేపట్టబోతున్నాం’’ అని సోము వీర్రాజు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM