Andhra News: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు

తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు అయింది. రూ.20 వేల పూచికత్తుతో సీఐడీ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 12 Feb 2022 06:13 IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు అయింది. రూ.20 వేల పూచికత్తుతో సీఐడీ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి నుంచి దాదాపు 17 గంటలపాటు అశోక్‌బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలోని ఉంచి విచారించారు. అనంతరం కొవిడ్‌ పరీక్ష నిర్వహించి నెగిటివ్‌ రావడంతో ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తెదేపా శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో జడ్జి నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని