CM Jagan: ప్రధాని మోదీతో గంటకు పైగా సీఎం జగన్‌ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాన మంత్రి మోదీతో గంటకు పైగా సమావేశమయ్యారు.

Updated : 05 Apr 2022 19:26 IST

దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.. ప్రధాన మంత్రి మోదీతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన సీఎం జగన్‌ సాయంత్రం హస్తిన చేరుకున్నారు. ప్రధాని మోదీని కలిసి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రస్తావించారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రెవెన్యూ లోటు, తెలంగాణ నుంచి రావాల్సి నిధులపైనా చర్చించినట్టు సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్న సీఎం జగన్‌... రాత్రి 9.30గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని