CM Jagan: ఆ ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి లేదు: సీఎం జగన్
ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడని, కానీ, రాజకీయాల్లో 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకొనే చంద్రబాబునాయుడు(Chandrababu naidu) మంగళగిరిలో
మురమళ్ల: ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడని, కానీ, రాజకీయాల్లో 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకొనే చంద్రబాబునాయుడు(Chandrababu naidu) మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు.. రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు సహా, మీడియా సంస్థలపైనా జగన్ తన అక్కసు వెళ్లగక్కారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దుష్ట చతుష్టయం అంటూ, దేవుడే వాళ్లకు వైద్యం చేస్తాడంటూ తీవ్ర పదజాలంతో అసహనం వ్యక్తం చేశారు.
పేదలను ఆదుకునేందుకు 32 పథకాలు
‘‘ఈ ప్రాంతంలోనే మల్లాది సత్య లింగన్ నాయకర్ అనే ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన కూడా ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో తాను చదువుకోలేకపోయాడు. సముద్రమంత కష్టాల్లో తన జీవితాన్ని ప్రారంభించి, అదే సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకున్నారు. అక్కడ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి, అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. తన సొంత గడ్డ మీద మమకారంతో ఇక్కడ భూములు కొని, ఈ ప్రాంతంలో మంచి జరగాలని ఒక ట్రస్టు పెట్టారు. ఆ ట్రస్టు ద్వారా దాదాపు 110 సంవత్సరాలుగా ఎన్నో వేలమంది పేదలకు మంచి చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే ఎంతోమందికి మేలు జరుగుతుంది. అటువంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. దాని నుంచి ఇంకా మంచి చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. పేదలకు మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకోవాలి. అలా లేనప్పుడు మంచి చేశామని చెప్పుకొనే అర్హత ఆ ప్రభుత్వానికి ఉండదు. పేదలకు అండగా ఉండేందుకు దాదాపు 32 పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మనది అని సగర్వంగా చెబుతున్నా’’
ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం
‘‘పాదయాత్ర సమయంలో మత్స్యకార కుటుంబాల సమస్యలు నేను విన్నాను. అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు నేను ఉన్నాను. అందుకే రూ.109కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ మరే ప్రభుత్వం ఇంత గొప్ప సాయం అందించలేదు. ఓఎన్జీసీ పైప్లైన్ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో 68 గ్రామాల్లో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు నెలకు రూ.11,500 చొప్పున నాలుగు నెలల పాటు అందిస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితే వస్తే, వాళ్లు కనీసం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు విడుదల చేశాం. చంద్రబాబు మొత్తం హయాంలో కేవలం రూ.104కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాం. మత్స్యకారులకు రాయితీతో డీజిల్ అందిస్తున్నాం’’
మంచి చేశామని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు!
‘‘ప్రభుత్వ పథకాల ద్వారా రూ.లక్షా 40వేల కోట్లు పేదలకు అందించాం. ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. ‘మా చంద్రబాబు మంచి చేశాడు’ అని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి కూడా లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను 95శాతం అమలు చేశాం. నిజాయతీ, నిబద్ధతతో మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ వద్దకే వస్తున్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఆ దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. ఈర్ష్య పుట్టుకొస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా జగన్ అన్న వైద్యం చేయిస్తాడు కానీ, ఈర్ష్య, కడుపుమంటకు వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు. పరీక్ష పేపర్లు వీళ్లే లీక్ చేయిస్తారు. లీక్ చేసిన వ్యక్తిని సమర్థించే ప్రతిపక్షాన్ని మీరు ఎక్కడైనా చూశారా? గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉంటూ ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి, ఈఎస్ఐలో పౌడర్లు, స్నో, మందులు, టూత్పేస్ట్ల పేరిట డబ్బులు కొట్టేసిన ప్రతిపక్షాన్ని మీరెప్పుడైనా చూశారా? కొడుక్కి అబద్ధాలు, మోసాల్లో శిక్షణ ఇస్తున్న చంద్రబాబులాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా? మంత్రిగా పనిచేసి, మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు ఒకరు.. రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే రాజకీయనాయకుడు ఇలాంటి వారిని నమ్ముకుంటున్నారు. రాజకీయ నాయకుడు ప్రజలను నమ్ముకుంటారు. కానీ, వాళ్లను నమ్మకుండా సొంతపుత్రుడు, దత్తపుత్రుడును నమ్ముకుంటున్న వ్యక్తిని చూశారా? జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంటే రాబందులు చూసి తట్టుకోలేకపోతున్నాయి. అలాంటి వారిని ఏమనాలి? రాష్ట్ర ద్రోహులు అందామా.. దేశ ద్రోహులు అందామా? 27ఏళ్లు చంద్రబాబు అనే పెద్ద మనిషి కుప్పంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏనాడూ అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన లేదు. ఈ రోజు మీ జగన్ మూడేళ్ల పరిపాలన చూసి, కుప్పంకు పరిగెత్తి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ తేడా ప్రజలే గమనించాలి’’ అని సీఎం జగన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
వైకాపా ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ