CM Jagan: జరగని ఘటనలు జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారు: ఏపీ సీఎం జగన్
సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో
అమరావతి: సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మరణాలపై తెదేపా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.
‘‘జంగారెడ్డిగూడెం జనాభా 55వేలు. అంతమంది నివసించే ప్రాంతంలో ఎవరైనా సారా తయారీ చేయగలుగుతారా? మున్సిపల్ వ్యవస్థ, వార్డు సచివాలయాలు, పోలీస్స్టేషన్ ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా? తక్కువ జనాభా ఉన్న మారుమూల పల్లెల్లో చేస్తున్నారంటే నమ్మడానికి అర్థం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలన్నీ ఒకే ప్రాంతంలో ఒకే రోజు జరిగినవి కావు. వారం, పది, పదిహేను రోజుల వ్యవధిలో చనిపోయారు. దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి. ఎందుకు చనిపోయారో తెలుసుకునేందుకు దహన సంస్కారాలు పూర్తికాని మృతదేహాలకు పోస్టుమార్టం చేయిస్తున్నాం.
తెదేపాది గోబెల్స్ ప్రచారం
జంగారెడ్డిగూడెం మరణాలపై చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఆయనకే అర్థం కావడం లేదు. ప్రజల్ని విపరీతంగా తాగించే కార్యక్రమం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఆ మాట అంటూనే సారా తాగి మనుషులు చనిపోయారని విమర్శిస్తున్నారు. సారా తాగిస్తే ప్రభుత్వానికే ఆదాయం తగ్గిపోతుంది కదా! చంద్రబాబు మాట్లాడే ఒక మాటకు రెండో మాటకు పొంతన లేదు. జరగని ఘటనలను జరిగినట్లు విష ప్రచారం చేస్తున్నారు. ఎంతలా అబద్ధాలను ప్రచారం చేస్తు్న్నారనేదానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక అబద్ధాన్ని పదేపదే నిజమని చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకునేలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇస్తే వింటాం. బడ్జెట్ చర్చలో పాలుపంచుకుని ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మంచి విషయాలు ఉంటే నోట్ చేసుకుంటాం. అలా కాకుండా సభలో చర్చలే జరగకుండా చేయడం వల్ల ఏమొస్తుంది?’’ అని జగన్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్