జగన్‌, షర్మిల మధ్య విద్వేషాల్లేవు: డిప్యూటీ సీఎం

ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు,

Updated : 10 Jul 2021 10:03 IST

తిరుమల: ఏపీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి విద్వేషాలు, మనస్పర్థలు లేవని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాచెల్లెలు మధ్య విభేదాలున్నాయని వదంతులు సృష్టిస్తున్నారన్నారు. జగన్‌కు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు కాదని చెప్పారు. కేసీఆర్‌ అంటే జగన్‌కు మంచి అభిమానం ఉందని నారాయణస్వామి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని