Andhra News: నూతన మంత్రుల జాబితాకు ఏపీ గవర్నర్ ఆమోదం
నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కొత్త జట్టులో 10 మంది పాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమరావతి: నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితాకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కొత్త జట్టులో 11 మంది పాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 25 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు నూతన మంత్రులకు గవర్నర్ శాఖలు కేటాయించనున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎంవో నుంచి ఆహ్వానాలు అందడంతో వారంతా విజయవాడ చేరుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఈరోజు సాయంత్రమే విజయవాడ చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.