AP High Court: స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని.. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
‘‘సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఎలాంటి ఆధారాల్లేవు. నిధులు విడుదల చేసినంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేం. చంద్రబాబు, తెదేపా ఖాతాకు నిధులు మళ్లింపుపై ఆధారాలు లేవు. ప్రతి ఉపగుత్తేదారు తప్పులకు సీఎంను బాధ్యుడిని చేయలేం. ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారు. కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి చంద్రబాబును అరెస్టు చేశారు. విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదు. ఆయన జడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు. కేసు విచారణ నుంచి ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. కేసు విచారణకు చంద్రబాబు విఘాతం కలిగించే అవకాశం లేదు. సీమెన్స్ డైరెక్టర్, డిజైన్టెక్ యజమాని వాట్సప్ సందేశాలకు, చంద్రబాబుకు సంబంధం ఏంటి? చంద్రబాబు లాయర్ల వాదనలతో అంగీకరిస్తున్నాం’’ అని తీర్పు వెల్లడి సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
వాదనలు కొనసాగాయిలా..
రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.
సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్కు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టేయాలి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Election Results: తెలంగాణ ‘హస్త’గతం ఇలా..!
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పతాకం తొలిసారి రెపరెపలాడింది. ఉద్యమ పార్టీ భారాసను ఓడించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మెరుపు వ్యూహంతో ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. -
Congress: తెలంగాణ ప్రజలకు థాంక్స్.. 4 రాష్ట్రాల ఫలితాలపై ఖర్గే రియాక్షన్ ఇదే..
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
Elections: ఇది అల మాత్రమే.. నిజమైన సునామీ ముందుంది: సువేందు
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా విజయం దిశగా దూసుకెళ్లడంపై భాజపా నేత సువేందు అధికారి స్పందించారు. -
Chhattisgarh: ప్రజలు ప్రధానిని నమ్మారు.. అందుకే బఘేల్ను తిరస్కరించారు: రమణ్ సింగ్
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం రమణ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. -
Pocharam: బాన్సువాడలో విజయం.. ఆనవాయితీకి అడ్డుకట్ట వేసిన పోచారం
నిజామబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. -
Nara Lokesh: 216వ రోజుకు చేరుకున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 216వ రోజుకు చేరింది. -
జగన్ మామ కాదు.. కంస మామ
దళిత బిడ్డలను మేనమామగా చూసుకుంటానని చెప్పిన జగన్.. వారిపాలిట కంస మామలా తయారయ్యారని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. -
దుష్టశిక్షణకు దుర్గమ్మను వేడుకున్నా
ధర్మాన్ని పరిరక్షించి.. దుష్టులను శిక్షించి.. సమాజాన్ని కాపాడమని దుర్గమ్మను వేడుకున్నట్టు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. -
వైకాపా గెలిస్తే సర్వనాశనమే
త్రిముఖ పోటీ జరిగి రాష్ట్రంలో 2, 3 శాతం ఓట్ల తేడాతో జగన్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే రాష్ట్రంలో వనరులు, వ్యవస్థలు అనేవే మిగలవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
పోలీసులు చంపాలని చూశారు
‘సీఎం జగన్ గత నెల 14న పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను చంపేందుకు కుట్ర చేశారు. ఆయన ప్యాలెస్లు కట్టుకోవచ్చు గానీ, పులివెందులలో పార్టీ కార్యాలయ భవనం నిర్మిస్తే ఓర్చుకోలేక నన్ను చంపడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించారు’ అని మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. -
తెదేపా- జనసేనల పొత్తుతో జగన్కేం పని?
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారమని.. దానితో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలకు సంబంధం ఏమిటని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. -
భాజపాతో కలవబోం: పవార్
భాజపాతో కలవబోమన్న తమ వైఖరిలో ఎప్పటికీ మార్పు ఉండబోదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. -
అమెరికాలోనూ వైకాపా కాలకేయుల ఆగడాలు: లోకేశ్
వైకాపా కాలకేయులు అమెరికాలోనూ దాడులు, దందాలు, అపహరణలకు తెగబడుతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. -
17న భీమిలిలో ‘యువగళం’ ముగింపు సభ
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 7న ప్రారంభం కానుంది. -
పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలి
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుపై దృష్టిసారించాలని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి మద్దతు: వైకాపా
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు హృదయపూర్వకంగా మద్దతు ఇస్తామని వైకాపా ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో 18నుంచి పాదయాత్ర
మానవ సంబంధాల విలువ తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఈ నెల 18నుంచి పాదయాత్ర చేయనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
TS Results: ‘కారు’కు నిరాశ.. ఆరుగురు మంత్రులకు షాక్
-
Social Look: క్యూట్ ట్రైనర్తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ మార్ట్స్
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
-
IND vs AUS: ఐదో టీ20 మ్యాచ్.. టాస్ నెగ్గిన ఆసీస్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
-
Rajasthan Election Result: రాజస్థాన్లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?
-
Revanth Reddy: హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్ ప్రస్థానమిది