సవాల్‌ విసిరి చంద్రబాబు ఏం చేశారు?: బొత్స

48గంటల సవాల్‌ విసిరి తెదేపా అధినేత చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు...

Published : 07 Aug 2020 03:02 IST

విశాఖ: 48గంటల సవాల్‌ విసిరి తెదేపా అధినేత చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటే.. చట్టాలకు లోబడే తాము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అమరావతి రాజధాని కాదని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అమరావతిలోనూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం.. త్వరలో విశాఖలో సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.  వెనుక, ముందు కట్‌ చేసిన వీడియోలను చంద్రబాబు జనాల్లోకి వదులుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఎందులో పేటెంట్‌ ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని