ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌

వైకాపాలో చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం..

Updated : 06 Jan 2021 13:31 IST

దిల్లీ: వైకాపాలో చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేయడానికి షెడ్యూల్‌ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాకు చెందిన ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ 18. పోలింగ్‌ ఈ నెల 28న ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది.

ఇవీ చదవండి..
కాంగ్రెస్‌కు ఆకర్షణీయ నేతలు కరవు

‘ఎమ్మెల్యే ఆదేశాలతోనే అంకులు హత్య’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని