AP Cabinet: కొత్త మంత్రుల విధేయత: జగన్‌ కాళ్లకు మొక్కి..చేతిని ముద్దాడి..

ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం

Published : 12 Apr 2022 01:26 IST

అమరావతి: ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పలువురు మంత్రులు సీఎం జగన్‌ వద్ద తమ విధేయతను చాటుకున్నారు. కొందరు సీఎం, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్‌ కాళ్లు మొక్కారు. 

ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి నారాయణస్వామి సీఎం జగన్‌ కాళ్లు తాకి నమస్కరించగా.. మరో మంత్రి ఉష శ్రీచరణ్‌ ఆయన కాళ్లకు మొక్కారు. మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేశ్‌ ఇంకాస్త విధేయతతో  మోకాళ్లపై పడి మరీ నమస్కరించారు. మంత్రి రోజా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించిన అనంతరం ఆయన చేతిని ముద్దాడి తమ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు