రాజ్‌భవన్‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ

రాష్ట్ర మంత్రులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో

Updated : 22 Jul 2020 15:47 IST

అమరావతి: రాష్ట్ర మంత్రులుగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో ఈ ఇద్దరితో బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌, శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఉప ముఖ్యమంత్రులు, కొత్త మంత్రుల కుటుంబసభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వేణుగోపాలకృష్ణకు రహదారులు-భవనాల శాఖ, అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖలను అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు