తెదేపాకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు 

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మేనిఫెస్టో ఉపసంహరించుకోవాలని...

Published : 05 Feb 2021 01:58 IST

అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. మేనిఫెస్టో ఉపసంహరించుకోవాలని తెదేపాకు సూచించింది. ఏపీలో నాలుగు విడతలుగా జరగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇటీవల మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే దీనిపై అధికార వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు తెదేపా మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ తెలుగుదేశం పార్టీని వివరణ కోరింది. తెదేపా వివరణ సంతృప్తికరంగా లేదని భావించిన ఎస్‌ఈసీ మేనిఫెస్టో పత్రాలను ప్రచారంలో వినియోగించవద్దని సూచించింది. 

ఇదీ చదవండి
ఆర్టీసీ ఉద్యోగ భద్రత దస్త్రానికి కేసీఆర్‌ ఆమోదం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని