ఐ అండ్ పీఆర్ కమిషనర్పై చర్యలు: నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో నిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. కర్నూలులో
ప్రకటన ఇచ్చే ముందు విధిగా సంప్రదించాలి
ఎన్నిలకు సంబంధించి ఏ అంశమైనా ఎస్ఈసీ పరిధిలోనే..
కర్నూలు: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో నిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. కర్నూలులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్ఈసీ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ భిన్నాభిప్రాయాలతో బాగుపడుతుందని చెప్పారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలన్నారు. అలాంటప్పుడే మంచి నాయకత్వం, సామాజిక దృక్పథం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బలవంతపు ఏకగ్రీవాలపై విధిగా షాడో బృందాలు ఏర్పాటు.. అవసరమైతే గృహనిర్బంధాలు చేయాలని జిల్లా అధికారులకు సూచించినట్లు ఎస్ఈసీ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార వ్యవస్థలన్నీ విజయవంతంగా పనిచేయబోతున్నాయని చెప్పారు.
ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ను వివరణ ఎస్ఈసీ కోరినట్లు చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నిమ్మగడ్డ ప్రకటించారు. ఏకగ్రీవాల బూచితో బలవంతపు ఎన్నికలు జరుపుతారేమో అనే ఆందోళనతో వివిధ పార్టీలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయని.. ప్రలోభపెట్టి, భయపెట్టి ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఎన్నికల్లో జోక్యం చేసుకుని భయభ్రాంతులకు గురిచేయొద్దని నేతలకు సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్ఈసీ పరిధిలోనే ఉంటుందని.. ప్రకటనలు ఇచ్చే ముందు విధిగా సంప్రదించాలన్నారు. ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ రమేశ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని.. చక్కని వాతావరణంలో ఎన్నికలను జయప్రదం చేయాలని ప్రజల్ని ఆయన కోరారు.
ఇవీ చదవండి..
ఏకగ్రీవ ఒత్తిళ్లపై ‘షాడో’ నిఘా: నిమ్మగడ్డ
నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం