10వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?: అచ్చెన్న

విన్నాను.. ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు రాష్ట్రంలో 10 వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?

Updated : 06 Jul 2021 14:45 IST

అమరావతి: విన్నాను.. ఉన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కు రాష్ట్రంలో 10 వేల ఉద్యోగ ఖాళీలే కనిపించాయా?అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. సీఎం చేసిన మోసం వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పత్రికా ప్రకటనలో మండిపడ్డారు. కర్నూలు జిల్లా చనుగొండ్ల గ్రామంలో నిరుద్యోగి గోపాల్‌ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటీకీ ప్రభుత్వ హత్యే అని.. అతడి కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

ఇంటికో ఉద్యోగం ఇస్తాననే మాట తప్పి రెండేళ్లలోనే కోటి మందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికి ప్రధాని మోదీకి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై యువతను దారుణంగా జగన్‌ దగా చేశారని అచ్చెన్న మండిపడ్డారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు