Mainpuri bypoll: నేతాజీ ఇలాకాలో.. తోటికోడళ్ల సవాల్ ఉండనుందా..?
మైన్పురీ లోక్సభా నియోజవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు(మైన్పురీ, భొగావ్, కిశనీ, కర్హల్, జస్వంత్ నగర్) ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్, కిశనీ, జస్వంత్ నగర్ స్థానాలు ఎస్పీ ఖాతాలో పడ్డాయి.
లఖ్నవూ: సమాజ్వాదీ(SP) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్పురి లోక్సభా నియోజకవర్గం ఖాళీగా మారింది. ఆ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో నిల్చున్నారు. సోమవారం ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. 1996 నుంచి ఇక్కడ ఎస్పీదే పట్టు. తాజాగా ఆమె ఎంపిక ములాయం వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. అలాగే ఈ ఉప ఎన్నిక వేళ.. పార్టీ క్యాడర్నంతా ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నంగానూ భావిస్తున్నారు. ఈ స్థానంలో డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎనిమిదిన ఫలితం వెల్లడికానుంది. నవంబర్ 17న నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ. ఇక ఇక్కడ భాజపా ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ను బరిలో దింపే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మెయిన్పురి లోక్సభా నియోజవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు(మెయిన్పురి, భొగావ్, కిశనీ, కర్హల్, జస్వంత్ నగర్) ఉన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్, కిశనీ, జస్వంత్ నగర్ స్థానాలు ఎస్పీ ఖాతాలో పడ్డాయి. మెయిన్పురి, భొగావ్లో మాత్రం భాజపా విజయం సాధించింది. ‘ఇక్కడి ప్రజలు ములాయంతో ఉద్వేగపూరితమైన సంబంధం కలిగి ఉన్నారు. గతంలో జరిగిన పరిణామాలను వారు పట్టించుకోరు. గతంలో పడని ఓట్లు కూడా ఇప్పుడు వస్తాయి. భాజపాకు వచ్చిన రెండు స్థానాల్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. అన్ని సీట్లు కలిపి చూస్తే.. ఎస్పీదే ఆధిక్యత’ అని ఎస్పీ నేత ఒకరు వెల్లడించారు. భాజపాకు సహకరించేందుకు అభ్యర్థిని నిలబెట్టే పార్టీలన్నింటికీ.. ప్రజలు తగిన సమాధానం ఇస్తారన్నారు.
ఇక్కడ భాజపా తన అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల అపర్ణా యాదవ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ ఛౌదరీతో సమావేశమయ్యారు. దాంతో కమలం పార్టీ ఆమెను బరిలో దింపుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల కొద్దిరోజుల ముందు ఆమె భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున అప్పుడు ప్రచారం కూడా నిర్వహించారు. ‘ములాయంజీ వారసత్వానికి అపర్ణ కూడా హక్కుదారే. ఆమెకు ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ(లోహియా)చీఫ్ శివపాల్ యాదవ్ మద్దతు కూడా ఉంది. ఇక్కడ అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయించేందుకు ప్రగతిశీల్ పార్టీ మద్దతు కూడా కీలకమే’ అని భాజపా నేత ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. ఇంకోపక్క భాజపా యాదవేతర ఓబీసీ అభ్యర్థి(ముఖ్యంగా శాఖ్య వర్గం)ని నిలబెట్టాలన్న ఆలోచనా చేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ జాబితాలో ఇటావా ఎంపీ రఘురాజ్ సింగ్ శాఖ్య, మమ్తేశ్ శాఖ్య, ప్రేమ్ సింగ్ శాఖ్య వంటి వారు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది. -
ఆ మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులకు ఓట్లేయొద్దు
లోక్సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్ప్రదేశ్లోని రాజ్పూత్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
కూటముల పోరు.. కలిసొచ్చేది ఎవరికి?
సార్వత్రిక ఎన్నికల సమరాన తమిళనాడులో చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధాన పోరు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా కూటముల మధ్యే నెలకొంది. -
తొలిదశకు ముగిసిన ప్రచారం
సార్వత్రిక సమరం అసలుసిసలు ఘట్టంలోకి ప్రవేశించింది. ఏడు విడతలకు విస్తరించిన ఎన్నికల్లో తొలిదశ కింద 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. -
రాష్ట్ర అంశాలే ఎజెండా
రాజస్థాన్లో భాజపా హవాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. క్లీన్స్వీప్ చేయకుండా కొన్ని సీట్లైనా దక్కించుకోవాలని పోరాడుతోంది. -
గ్యారంటీగా వచ్చేది మేమే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా అధికారంలోకి వచ్చేది తామేనని ప్రధాని మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అస్సాంలోని నలబాడీలో, త్రిపుర రాజధాని అగర్తలలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. -
ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్
దేశంలో ఎన్నికల బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. -
సంక్షిప్త వార్తలు
దేశంలోని అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం వెనకున్న ఉద్దేశమేమిటి? -
తొలి విడతలో కీలకం!
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. -
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాంనబీ ఆజాద్.. అనంత్నాగ్-రాజౌరి సీటు నుంచి పోటీ చేయట్లేదని ఆ పార్టీ ప్రకటించింది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ
లోక్సభ ఎన్నికల తొలి విడత బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడివిడిగా లేఖలు రాశారు. -
పేదలకు ఉచితంగా 10 గ్యాస్ సిలిండర్లు
కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా 10 గ్యాస్ సిలిండర్లు, 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. -
ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకొని ఓటేద్దాం
ఓటుహక్కు ఉన్న అందరం ఎన్నికల ప్రక్రియలో పాల్గొందామని, ఓటు వేసే ముందు దేశంలో ఐదేళ్లలో ఏం జరిగిందో అవలోకనం చేసుకుని సరైన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేద్దామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం అన్నారు. -
బీఎస్పీలోకి మందా జగన్నాథం
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
గురుకులాలపై సీఎం వివక్ష: భారాస
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ గురుకుల పాఠశాలలపై వివక్ష చూపుతున్నారని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ విమర్శించారు. -
రాష్ట్రంలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం: కె.లక్ష్మణ్
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేసీఆర్దే లిల్లీపుట్ మనస్తత్వం: మల్లు రవి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. -
పార్లమెంటు నియోజకవర్గాలకు కిసాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జుల నియామకం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రంలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి మినహా మిగతా 14 పార్లమెంటు నియోజకవర్గాలకు జోనల్, నియోజకవర్గ ఇన్ఛార్జులను నియమించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!