Kejriwal: ఆప్ తర్వాతి టార్గెట్ ఈ రాష్ట్రాలే.. త్వరలోనే కేజ్రీవాల్ పర్యటన
ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఆప్(AAP) గురిపెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో దిల్లీ తరహా పాలన హామీలతో ఆ పార్టీ శ్రేణులు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో వచ్చే నెలలో కేజ్రీవాల్(Kejriwal) ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారానికి శంఖాన్ని పూరించనున్నారు.
దిల్లీ: పంజాబ్(Punjab)లో అపూర్వ విజయం, ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లతో జాతీయ పార్టీ హోదాను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న ఆప్ (AAP).. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఆ పార్టీ శ్రేణులు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోయే కర్ణాటక సహా మరికొన్ని భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ఆప్ దృష్టిపెట్టింది. ఇందుకోసం వచ్చే నెలలో ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ (Kejriwal) కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఆప్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయబోతున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ పర్యటన తేదీలు సైతం ఖరారైనట్టు సమాచారం.
మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగే కర్ణాటకలో ఇప్పటికే ఆప్ ముఖ్య నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్లపై విమర్శలతో పాటు దిల్లీ తరహా పాలన అందిస్తామంటూ ప్రజలను తమవైపు ఆకర్షించే వ్యూహాలకు అమలుచేస్తున్నారు. అయితే, మార్చి 4న కర్ణాటకలో కేజ్రీవాల్ పర్యటించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మార్చి 5న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్గఢ్; మార్చి 13న రాజస్థాన్; మార్చి 14న భాజపా పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఆప్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. గతేడాది పంజాబ్లో అపూర్వ విజయం సాధించిన ఆప్.. గతంలో గోవా ఎన్నికల్లో రెండు సీట్లు, గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు, 13శాతం ఓట్లతో తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎలాంటి ప్రభావం చూపబోతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల పోటీ చేసినా ఎక్కడా ఆప్ బోణీ కొట్టలేదు. అయితే, ఈసారి మాత్రం తాము అన్ని సీట్లలోనూ పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం 224 సీట్లకు గాను ఆప్ 28 చోట్ల పోటీ చేయగా.. ఛత్తీస్గఢ్లో (90) 85 చోట్ల, రాజస్థాన్ (200)లో 142, మధ్యప్రదేశ్ (230)లో 208 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూడాలి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్