PM Security Breach: ప్రధాని హత్యకు కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయాలి:బిశ్వ శర్మ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాన మంత్రిని హత్య చేసేందుకు
డిస్పూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, పంజాబ్ సీఎం కుట్ర పన్నినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ కుట్రలో భాగమైన సీఎంను అరెస్ట్ చేయాలి’’ అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
జనవరి 5న పంజాబ్లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటనలో ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆ రాష్ట్ర పోలీసులకు జనవరి 2వ తేదీనే నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం హిమంత ఆరోపించారు. ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కుట్ర గురించి వారికి ముందే తెలుసున్నట్లుగా ఉన్నాయన్నారు.
పంజాబ్లోని ఫిరోజ్పుర్ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్పై చిక్కుకుపోయింది. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భద్రతా వైఫల్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు